
- కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి
నిజామాబాద్, వెలుగు: టెన్త్ క్లాస్ పాసైన విద్యార్థులు పైచదువులకు వెళ్లేలా చూడాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి కోరారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన మీటింగ్లో మాట్లాడారు. ఇంటర్, పాలిటెక్నిక్, ట్రిపుల్ ఐటీ తదితర కోర్సులో చేరిన వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. పేరెంట్స్ ఆర్థిక సమస్యలతో చదువు ఆపివేస్తే చొరవ తీసుకొని సర్కార్ కాలేజీల్లో చేర్పించాలని విద్యాశాఖ యంత్రాంగాన్ని సూచించారు.
ప్రైవేట్ కంటే దీటుగా సర్కార్ బడుల్లో బోధన ఉండాలని, మ్యాథ్స్, ఇంగ్లిష్, సైన్స్లో వెనుకబడ్డ విద్యార్థులపై ఫోకస్ పెట్టాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనులు త్వరగా ముగిసేలా చూడాలని, ప్రభుత్వ హాస్టల్స్లో మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలన్నారు. అదనపు కలెక్టర్ కిరణ్కుమార్, డీఈవీవో రవికుమార్, డీఈవో అశోక్కుమార్, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ఆఫీసర్లు స్రవంతి, రజినీ, నాగోరావు తదితరులు ఉన్నారు.