టెన్త్ పాసైనవారిని ఇంటర్లో చేర్పించాలి : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

టెన్త్ పాసైనవారిని ఇంటర్లో చేర్పించాలి : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి
  • కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి 

నిజామాబాద్​, వెలుగు: టెన్త్​  క్లాస్ పాసైన విద్యార్థులు పైచదువులకు వెళ్లేలా చూడాలని కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి కోరారు. శుక్రవారం కలెక్టరేట్​లో నిర్వహించిన మీటింగ్​లో మాట్లాడారు. ఇంటర్, పాలిటెక్నిక్, ట్రిపుల్ ఐటీ తదితర కోర్సులో చేరిన వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. పేరెంట్స్ ఆర్థిక సమస్యలతో చదువు ఆపివేస్తే చొరవ తీసుకొని సర్కార్​ కాలేజీల్లో చేర్పించాలని విద్యాశాఖ యంత్రాంగాన్ని సూచించారు.

ప్రైవేట్ కంటే దీటుగా సర్కార్​ బడుల్లో బోధన ఉండాలని, మ్యాథ్స్​, ఇంగ్లిష్​, సైన్స్​లో వెనుకబడ్డ విద్యార్థులపై  ఫోకస్​ పెట్టాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనులు త్వరగా ముగిసేలా చూడాలని, ప్రభుత్వ హాస్టల్స్​లో మెనూ ప్రకారం  పౌష్టికాహారం అందించాలన్నారు.  అదనపు కలెక్టర్​ కిరణ్​కుమార్, డీఈవీవో రవికుమార్, డీఈవో అశోక్​కుమార్, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ఆఫీసర్లు స్రవంతి, రజినీ, నాగోరావు తదితరులు ఉన్నారు.